బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం పోర్టును ఆదానీకి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ కొంతకాలంగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ఆ ప్రజల ఆందోళనకు, ఉద్యమానికి భారతీయ జనతా పార్టీతో పాటు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతునిచ్చింది.