కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. బాధిత కుటుంబాలకు కొంత నగదు ఇచ్చారు. అయితే తమకు కావాల్సింది డబ్బుకాదని…న్యాయమని అంటూ ఆయనిచ్చిన రెండు లక్షల రూపాయలను ఆయన కాన్వాయ్ పైకి విసిరేసిందో ముస్లిం మహిళ. ఇప్పుడా వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 7న కెరూర్ పట్టణంలో స్వల్ప ఘర్షణలు జరిగాయి. పలువురికి గాయాలయ్యాయి. అది సిద్ధరామయ్య అసెంబ్లీనియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే ఘటన జరిగిన ఇన్ని రోజులకు ఆయన ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లారు. నాలుగు బాధిత కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఇచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే మహిళ ఆయన కారును వెంబడిస్తూ అరుస్తూ వెళ్తుంటే కారును ముందుకే పోనిచ్చారు సిద్ధరామయ్య.
https://twitter.com/ANI/status/1547977662857347072?s=20&t=b4bWyZbv3S3hSbpa9tGV9g