రాజస్థాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యకేసు నిందితులకు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జైల్లో ఉన్నవారికి బిర్యానీ సరఫరా చేశారంటూ వచ్చిన వార్తల్ని రాజస్థాన్ పోలీసులు ఖండించారు. పూర్తిగాతప్పుడువార్తలని కొట్టిపారేశారు. హంతకులకు జైల్లో బిర్యానీ పెట్టారు. ఇదే యూపీలో అయితేనా? అనే శీర్షికతో ఓ హిందీ న్యూస్ వెబ్ సైట్ వార్తను ప్రచురించింది.అయితే పోలీసులు ఆ ప్రచారాన్ని ఖండించడంతో ఆ వార్తను డిలిట్ చేశారు.
ఈ ప్రచారాన్ని ట్విట్టర్ వేదిగ్గా తోసి పుచ్చారు రాజస్థాన్ పోలీసులు. ”ఒక తప్పుడు వార్త వైరల్ అవుతోంది. నేరస్థులకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు, మర్యాదలు లేవు. క్రిమినల్స్తో పోలీసులు మెతకగా వ్యవహరించేది లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని ఆ ట్వీట్లో తెలిపారు. ఫేక్ న్యూస్కు సంబంధించిన స్క్రీన్షాట్ను కూడా ట్వీట్కు జతచేశారు.
#सोशल_मीडिया पर वायरल हो रही है एक फेक न्यूज। ये सरासर गलत है। #उदयपुर में जघन्य अपराधियों के खिलाफ #राजस्थान_पुलिस कठोर कार्रवाई करेगी।
पुलिस असामाजिक तत्वों से नरमी से नहीं आएगी पेश।
प्रदेश में कानून व्यवस्था कायम रखने के लिए #राजस्थान_पुलिस है कटिबद्ध। pic.twitter.com/arcWua5oX3
— Rajasthan Police (@PoliceRajasthan) June 29, 2022
అటు టైలర్ హత్య తరువాత ఉదయ్ పూర్లో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొనగా… ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉంది. ఈ కేసును ఎన్ఐఏ (NIA)కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇక కన్హయ్య హత్య ఘటన వెనక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నఉగ్రసంస్థ కు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. కాగా ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. 10 మందికిపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ ఆదేశంలో రంగంలోకి దిగిన ఎన్ఐఏ బృందం ఈ హత్యలో విదేశీ ఉగ్రసంస్థలు, విదేశీ కుట్రలపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది.
టైలర్ కన్హయ్యా లాల్ను 26 సార్లు నరికి, పొడిచి చంపినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. కన్హయ్యా లాల్ స్వస్థలం మల్దాస్ ప్రాంతంలో అంత్యక్రియలు జరిగాయి. పెద్దసంఖ్యలో జనం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.