బిహార్లో ఓ విచిత్రం వెలుగుచూసింది. ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తుంటే.. ఆ భార్య మాత్రం ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అవును ఆమె చనిపోలేదు. కానీ హత్యానేరంపై కేసు నమోదు చేసి భర్తను జైలుకు పంపారు. బిహార్ కు మోతిహరీకి చెందిన శాంతిదేవి అనే యువతికి 2016లో లక్ష్మీపూర్ నివాసి దినేష్ రామ్ తో పెళ్లైంది. అయితే కొంతకాలం బాగానే ఉన్న శాంతిదేవి కొన్నిరోజుల క్రితం అదృశ్యమైంది. భర్తే ఆమెను హత్య చేసి శవాన్ని మాయం చేశాడంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊరంతా అదే నిజమనుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే అందరూ చనిపోయారనుకుంటున్న శాంతీదేవీ పంజాబ్ జలంధర్ లో తేలింది. అక్కడ ప్రియుడితో కలిసి ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
శాంతిదేవి అదృశ్యమైన వెంటనే ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కోసం వేధించడమే కాక… తన కుమార్తెను హత్య చేశాడని ఆరోపించారు.అయితే శాంతీదేవీ డెడ్ బాడీ దొరక్కపోవడం, దినేష్ ఎంతకీ నేరాన్ని ఒప్పుకోకపోవవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. శాంతి మొబైల్ ఫోన్ ద్వారా లొకేషన్ కనుగొనాలని టెక్నికల్ టీంను డిపార్ట్ మెంట్ ఆదేశించింది. దీంతో ఆమె పంజాబ్ జలంధర్లో ప్రియుడితో ఉంటున్నట్టు గుర్తించి వెనక్కి తీసుకువచ్చారు.