బీహార్ నాటుసారా విషాదం కేసు.. సంచలన తీర్పు వెలువడించిన కోర్టు.. ఏకంగా..
Nine convicts of 2016 Gopalganj (Bihar) hooch tragedy sentenced to capital punishment, 4 women sentenced to life imprisonment.
21 people had died in the incident.
— ANI (@ANI) March 5, 2021
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బీహార్ గోపాల్గంజ్ నాటుసారా కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఘటనలో ఏకంగా 21 మంది మరణించారు. అయితే ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారణ చేపట్టింది. 2016లో జరిగిన ఈ ఘటనలో నాటుసారా కాటుకు మొత్తం 21 మంది బలయ్యారు. అయితే ఈ ఘటనకు కారకులుగా తేలిన వారిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఘటనకు కారకులైన తొమ్మిది మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువడించింది. వీరితో పాటుగా మరో నలుగురు మహిళలను కూడా దోషులుగా తేలుస్తూ వారికి యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీన 13 మందిని దోషులుగా తేల్చింది. వారికి శుక్రవారం నాడు శిక్షలను ఖరారు చేసింది. అయితే మరణశిక్ష పడ్డ తొమ్మిది మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు.
కాగా,2016 ఆగస్టులో గోపాల్గంజ్ జిల్లాలోని ఖర్జుర్బానీ ప్రాంతంలో ఈ నాటుసారా విషాదం చోటుచేసుకుంది. 21 మంది మరణించడమే కాకుండా.. ఎంతో మంది చూపు కోల్పోయారు. ఘటనకు సంబంధించి 21 మంది పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. వీరిలో ముగ్గురు సబ్ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు.