బీహార్ లో నూతనంగా ఏర్పడిన నితీష్ కుమార్ క్యాబినెట్ లో 31 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఆర్జేడీకి 16 మంది మంత్రులు ఉండగా, 11 మంది సీఎం నితీష్ కుమార్ తరపున, ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు హిందుస్తానీ ఆవామ్ మోర్చా (HAM) తరపున, అలాగే ఒక స్వతంత్రుడు కూడా ఉన్నారు. సీఎం నితీష్ కుమార్ కీలకమైన హోం శాఖను తనవద్దే ఉంచుకున్నారు. ఆరోగ్య శాఖను డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఇచ్చారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్కు పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ ఇచ్చారు. జేడీయూ నేత విజయ్ చౌదరికి ఆర్థిక శాఖ దక్కింది.