దీదీకి బిగ్ షాక్.. కమలం గూటికి చేరిన బెంగాల్ కీలక నేత.
https://twitter.com/ANI/status/1368093788543938567
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బెంగాల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్ పీఠం ఎక్కాలని తహతహలాడుతున్న కమల దళం కలలు సాకారమయ్యేలా ఉన్నాయి. బెంగాల్లోని కీలక నేతలంతా బీజేపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు కమ్యూనిస్టు పార్టీకి చెందిన నేతలు బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్ త్రివేదీ కూడా బీజేపీ గూటికి చేరుకున్నారు. ఇటీవలే ఆయన టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు అదే రోజు టీఎంసీ పార్టీకి కూడా గుడ్బై చెప్పారు. శనివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. దినేశ్ త్రివేదీకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నారు.