జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దషాక్ తగిలింది. గులాంనబీ ఆజాద్ కు మద్దతుగా పెద్దఎత్తున రాజీనామాలు చేశారు స్థానిక నాయకులు. వారిలో సీనియర్లు లీడర్లున్నారు. మాజీ ముఖ్యమంత్రి తారాచంద్ సహా 64 మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కలిసికట్టుగా రాజీనామా లేఖను అధినేత్రి సోనియాకు పంపారు. తారాచంద్తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజీద్ వని, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ తదితరులు రాజీనామా సమర్పించిన వారిలో ఉన్నారు.ఆజాద్కు మద్దతుగానే తామంతా పార్టీని వీడుతున్నట్టు తెలిపారు.
రాహుల్ గాంధీ వల్లే పార్టీ పతనమైందని ఆయన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ గత శుక్రవారం గులానబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. సీనియర్ల సలహాలను పట్టించుకోకుండా భజనపరులను రాహుల్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ నుంచి జాతీయ స్థాయి పార్టీని సొంతంగా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సహా వందలాదిమంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఆయనకు మద్దతుగా పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నారు.