ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలకాలం చెలరేగుతోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా , ఆయన సహచరులు ఆపధర్మ మంత్రులుగా ఉన్నారు. ఈ సమయంలో పరిపాలన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా నడుస్తూ ఉంటుంది. పేరుకు మాత్రం ఆపధర్మ ప్రభుత్వం ఉండడం జరుగుతుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడికి వీలుగా వైయస్ జగన్ లాంఛనంగా గవర్నర్ ని కలిసి రాజీనామా పత్రం సమర్పించాల్సి ఉంటుంది అప్పటిదాకా ఆయన్ని ముఖ్యమంత్రిగాని పరిగణిస్తారు ఆయన సహచరులు మంత్రులుగా కొనసాగుతారు.
ఈ లోగానే మంత్రులకు బిగ్ షాక్ ఇచ్చింది సాధారణ పరిపాలన విభాగం. మంత్రుల పేషీలకు జూన్ 3న తాళాలు వేస్తామని, ఆలోగా వాళ్లను ఖాళీ చేయించాలని జీఏడీ వెల్లడించింది ఆ తేదీ లోగా మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ఆయా కార్యాలయాల సిబ్బందికి సూచించింది. ఆ లోగా మంత్రు.లందరూ తమ తమ ఛాంబర్ లు ఖాళీ చేయాలని కోరింది.
సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమ అనుమతి లేకుండా సచివాలయం నుంచి చిన్న వస్తువును కూడా తరలించొద్దని తేల్చి చెప్పింది. తమ అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లడానికి వీళ్లేదని సూచించింది.
ముఖ్యంగా మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలపై నిఘా పెట్టాలని, అనుమతి లేకుండా తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సచివాలయంలో రాకపోకలపై మరింత దృష్టి సారించాలని, తప్పనిసరిగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతించాలని ఆదేశించింది.
ఈ అంశాల మీద వైసిపి పెద్దలు అభ్యంతరం తెలుపుతున్నారు. మంత్రులు పదవీకాలంలో ఉండగానే చాంబర్ల నుంచి వెళ్ళగొట్టడం సరైన ఆనవాయితీ కాదని. వాదిస్తున్నారు. ఫైల్స్ ని సంరక్షించుకోవడంలో భాగంగానే ఈ చర్య జరుగుతోందని తెలుగుదేశం కౌంటర్గా వాదిస్తుంది