బిగ్ బాస్-10 ఫేమ్ కన్నుమూత
బుల్లితెర రియాల్టీ షో బిగ్బాస్-10వ సీజన్లో వివాదాస్పద కంటెస్టెంట్ స్వామి ఓం కన్నుమూశారు. తానే దేవుడి అవతారమంటూ స్వయంగా ప్రకటించుకున్న స్వామి ఓం.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అర్జున్ జైన్ సన్నిహితులు మీడియాకు తెలియజేశారు
బిగ్బాస్-10 సీజన్లో హౌస్లోకి ప్రవేశించిన తర్వాత.. స్వామి ఓం ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. షోలో ఉన్న సమయంలో సహచరులతో ఆయన అత్యంత వివాదాస్పదంగా ప్రవర్తించారు. ఏకంగా ఓ కంటెస్టెంట్తో పెద్ద గొడవ చేసి.. అసభ్య రీతిలో ప్రవర్తించడంతో ఆయన్ను వెంటనే షో నుంచి ఎలిమినేట్ చేశారు. అనంతరం ఆయన ఆశ్రమంలో ఉంటూ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారినపడటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం పక్షవాతం కూడా రావడంతో ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచారు.