తమ దేశ అత్యున్న పురస్కారం న్గడగ్ పెల్ గి ఖోర్లో(Ngadag Pel gi Khorlo)ను భారత ప్రధానికి ప్రకటించింది భూటాన్. ఆ దేశ పీఎంవో ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే సూచనమేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో తమకే కాక…ప్రపంచ దేశాలకు మోదీ అందించిన మద్దతు మరువలేనిదని భూటాన్ పీఎంవో వ్యాఖ్యానించారు. ఈ అత్యున్నత పురస్కారాన్ని 2008లో నెలకొల్పారు. దాన్ని అందుకుంటున్న తొలి విదేశీయుడు భారత ప్రధానే. ఇవాళ భూటాన్ జాతీయ దినోత్సవం అని…ఈ శుభ సందర్భంగా మోదీకి ఈ పురస్కారం ప్రకటించడం ఆనందంగా ఉందని… ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్ అన్నారు.
https://twitter.com/PMBhutan/status/1471715660724006914?s=20