హైదరాబాద్ లోని SCRPS రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు కర్ణ శ్రీశైలం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారు SCRPS కండువా కప్పి భూషిపాక సంతోష్ మహారాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జూలా రాజేష్ గారిని కార్యదర్శిగా ఎన్నుకోని నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలోని బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని.. జిల్లాలోని ప్రతి గడపగడపకు సంస్థను చేరవేసి కృషి చేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా మంతిని నియోజకవర్గ SCRPS నాయకులు ఆవునూరి ప్రణయ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా సంతోష్ , రాజేష్ గార్ల కు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)