భోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన భీమ భీంరావ్ చేనులో కోతకు వచ్చిన గోదుమ పంట కాలిపోయింది. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గ్రామానికి వెళ్ళి రైతును కలిసి పరామర్శించారు. పంట నష్టానికి కారణాలు అడిగి తెలుసుకోగా 3 ఎకరాల పొలంలో గోధుమ పంట వేసాడని.. పంట కోతకు వచ్చే సమయంలో అగ్నికి ఆహుతైందని బాధపడ్డాడు ఆ రైతు. అందులోనే 50 కి పైగా పైపులు కాలి బూడిదయ్యాయని కన్నీటిపర్యంతమయ్యారు. భోథ్ నియోజక వర్గంలో కేవలం ఒకే ఒక ఫైర్ ఇంజన్ ఉందని అది కూడా ఇచ్చోడలో ఉందని భోథ్ లో ఉండి ఉంటే పంట కొంచమైనా దక్కేదని గ్రామస్తులు అన్నారు. 3 నెలల పాటు కష్టపడి కోతకు వచ్చిన సమయంలో పంటను కోల్పోవడం భాదాకరమని భీంరావ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బలరాం విజ్ఞప్తి చేసారు. బలరాంతో సుభాష్ సూర్య, MPTC అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ కట్ట భుమేష్, వెండి సోమేష్, సోలంకి సాయి, శ్రీనివాస్ సహా తదితరులు ఉన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)