కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రకు సంబంధించిన ప్రచార వీడియోను జైరాం రమేశ్ విడుదల చేశారు. 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ యాత్ర ఉంటుంది. ప్రతిరోజూ 22 , 23 కిలో మీటర్ల పాటు పాదయాత్ర సాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర సాగుతుందని… ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ రాహుల్ ముందుకెళ్తారని పార్టీ అంటోంది. ఇక యాత్ర కోసం స్పెషల్ గా సాంగ్ ను చిత్రీకరించారు.
కన్యాకుమారిలో తమిళ పాటను, యాత్ర కేరళ లో ప్రారంభం అయ్యే ముందు మలయాళంలో విడుదల చేయనున్నారు.