చోళులు, పల్లవులు, అహోంలు సహా అనేక ప్రముఖ రాజవంశాలను చరిత్రకారులు విస్మరించారని.. కేవలం మొఘలులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధానిలో ‘మహారాణా: సహస్త్ర వర్ష కా ధర్మ యుద్ధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా షా మాట్లాడారు. “నేను చరిత్రకారులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనకు అనేక సామ్రాజ్యాలు ఉన్నాయి, కానీ చరిత్రకారులు మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు, వారి గురించి మాత్రమే రాశారు” అని అన్నారు.
“ఎప్పుడైతే స్వతంత్ర చరిత్రకారులు చరిత్ర వ్రాసినప్పుడు, నిజం వస్తుంది….” అనీ అన్నారు కేంద్ర హోంమంత్రి.
పాండ్యుల సామ్రాజ్యం 800 ఏళ్లు, అహోం సామ్రాజ్యం 650 ఏళ్లు అసోంను పాలించిందని చెప్పారు. అహోంలు భక్తియార్ ఖిల్జీ, ఔరంగజేబులను కూడా ఓడించి అస్సాం సార్వభౌమాధికారాన్ని కొనసాగించారు. పల్లవ సామ్రాజ్యం 600 సంవత్సరాలు పాలించింది. చోళులు 600 సంవత్సరాలు పరిపాలించారు, అయితే వీటన్నింటికీ భారతదేశ చరిత్రలో తగిన ప్రాముఖ్యత లభించలేదు. మౌర్యులు మొత్తం దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లంక వరకు 550 సంవత్సరాలు పాలించారు. శాతవాహనులు 500 సంవత్సరాలు పాలించారు. గుప్తులు 400 సంవత్సరాలు పాలించారు, సముద్రగుప్తుడు మొదటిసారిగా అఖండ భారతదేశాన్ని ఊహించాడు. కానీ వాటిపై ఎలాంటి రిఫరెన్స్ బుక్ లేదు’’ అని షా వాపోయారు.
“ఈ సామ్రాజ్యాలపై ఎక్కువ సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలు వ్రాసినప్పుడే క్రమంగా వాస్తవాలు బయటపడతాయని మేం నమ్ముతున్నాం” అనిఅన్నారు.
గెలుపు ఓటముల ఆధారంగా చరిత్ర రాసి ఉండకూడదు, అది ఒక సంఘటన ఫలితం ఆధారంగా వ్రాయాలి. ప్రభుత్వం, పుస్తకాల ఆధారంగా చరిత్ర ఉండదు, సంఘటనల ఆధారంగానే సత్యం రూపొందింది. సత్యాన్ని వ్రాయకుండా మనల్ని ఎవరూ ఆపలేరు. మనం ఇప్పుడు స్వతంత్రులం. మన చరిత్రను మనమే వ్రాసుకోగలం.దీనికి దశాబ్దాలు, 50 సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు కావచ్చు, కానీ చివరికి విజయం సాధించేది సత్యం” అని అన్నారు.