భళా భారత్ భళా.. శత్రుదేశాలకు ఇక చుక్కలే.. ఈ స్వదేశీ డ్రోన్ ప్రత్యేకతలను చూస్తే ఖంగుతినాల్సిందే
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి రక్షణ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలను వీలైనంత తగ్గించి.. వాటిని “మేక్ ఇన్ ఇండియా” ప్రోగ్రాంలో మన దేశంలోనే తయారు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచానికే దిమ్మతిరిగే అధునాతన డ్రోన్లను తయారు చేసేందుకు రెడీ అయ్యింది. అత్యధిక ఎత్తున ఎగిరే అత్యాధునిక స్వదేశీ డ్రోన్ ‘ఇన్ఫినిటీ’ని రెడీ చేయబోతుంది. మరో ఐదేండ్లలోపు సైనిక దళాలకు ఇది అందుబాటులోకి రానుంది. దీనిని బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ న్యూస్పేస్ భాగస్వామ్యంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)అభివృద్ధి చేస్తుంది. సోలార్తో పనిచేసే ఈ డ్రోన్ ఏకధీటుగా 90రోజుల పాటు 65,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. భారతదేశ మానవరహిత డ్రోన్ వార్ఫేర్ ప్రోగ్రామ్, కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ దీనిలో కీలకం కానున్నది.
నింగిలోని స్ట్రాటో ఆవరణలో భవిష్యత్ యుద్ధ అవసరాల కోసం ఈ ఇన్సినిటీ డ్రోన్ను రూపొందిస్తున్నట్లు హాల్ అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సింథటిక్ ఎపర్చర్ రాడార్తో పాటు పలు రకాల సెన్సార్లతో కూడిన ఈ డ్రోన్ శత్రు భూభాగంలోని టార్గెట్స్ను లోతుగా ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు.‘లాయల్ వింగ్మాన్’వారియర్ వంటి ఇతర ఇండియన్ డ్రోన్ వ్యవస్థలు, స్వదేశీ పోరాట ఎయిర్ టీమింగ్ వ్యవస్థలో భాగమైన ఆల్ఫా-ఎస్ సమూహ డ్రోన్స్ లేదా హంటర్ క్రూయిజ్ క్షిపణులు నిర్వహించే దాడి మిషన్లను ఇది సమన్వయం చేస్తుందని అధికారులు తెలిపారు. దాడులు జరిగితే ఆ సమాచారాన్ని గ్రౌండ్లోని మానిటరింగ్ స్టేషన్లకు లైవ్ వీడియో ఫీడ్ను కూడా ప్రసారం చేయగలదన్నారు.