గణేశ్ నిమజ్జనాన్ని అడ్డుకుంటున్నారంటూ భాగ్యనగర గణేశ ఉత్సవసమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత కొన్ని రోజులుగా సరూర్ నగర్ వినాయక సాగర్ వద్దకు నిమజ్జనానికి వస్తున్న గణనాథులను జిహెచ్ఎంసి వాహనాల్లో ఎక్కిస్తూ పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు విమర్శలొచ్చాయి. దీంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రత్యేక కార్యాచరణకు దిగింది. ఉత్సవసమితి ప్రతినిధులు స్వయంగా వినాయక్ సాగర్ కు వెళ్లి… గణనాథులను నిమజ్జనం చేశారు..