అంతరిక్షంలోకి భగవద్గీత, ప్రధాని చిత్రం.. అంతేకాదు ఇంకా..
అంతరిక్షంలోకి హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను పంపుతున్నారు. అంతేకాదు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను కూడా పంపేందుకు ఓ ప్రైవేట్ శాటిలైట్ రెడీ అయ్యింది. ఈ శాటిలైట్ ద్వారా.. భగవద్గీత కాపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో, మరో 25 వేల మంది పేర్లను అంతరిక్షంలోకి మార్చి నెలలో మోసుకెళ్లనున్నారు. ఈ శాటిలైట్కు సతీష్ ధావన్ లేదా ఎస్డీ శాట్ అనే పేరు పెట్టనున్నారు. పీఎస్ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) ద్వారా ఈ శాటిలైట్ను పంపించనున్నారు. దీనిని స్పేస్ కిడ్జ్ ఇండియా డెవలప్ చేసింది. ఈ సంస్థ విద్యార్ధుల్లో స్పేస్ సైన్స్ను ప్రోత్సహిస్తోంది. ఇదే శాటిలైట్ ద్వారా మరో మూడు పేలోడ్స్ను కూడా తీసుకెళ్లబోతుంది. అందులో ఒకటి స్పేస్ రేడియేషన్ను మరొకటి మాగ్నెటోస్పియర్ను అధ్యయనం చేయనుండగా.. ఇంకోటి లోపవర్ వైడ్ ఏరియా కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం పంపిచనున్నారు. స్పేస్కిడ్జ్ ఇండియా సీఈవో డాక్టర్ శ్రీమతి కేశన్ మాట్లాడుతూ.. తమ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లే సమయం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామన్నారు.