………….
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో అపచారం చోటుచేసుకుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలోనే అన్యమత ప్రచారానికి తెగబడ్డారు. స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉండే హనుమంతుడి మందిరం దగ్గర క్రైస్తవ మత సాహిత్యం బయటపడింది. దొంగ చాటుగా భక్తులకు ప్రచారం చేయడం మీద అందరూ మండిపడుతున్నారు.
………..
భద్రాచలం లో సీతారాములకు … భక్తులు విలువైన వస్త్రాలను సమర్పిస్తుంటారు. కోర్కెలు తీర్చినందుకు.. భక్తి పూర్వకంగా మొక్కులు చెల్లిస్తారు. అనంతరం దేవస్థానం వారు కాంట్రాక్టర్ ద్వారా ఈ శేష వస్త్రాలను… ఆంజనేయ స్వామి ఆలయం పక్కన దుకాణం లో విక్రయిస్తుంటారు. అయితే దుకాణదారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార స్లోగన్ ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం ఇప్పడు హాట్ టాపిక్గా మారింది.
………
స్థానిక భక్తులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే…
గుంటూరు జిల్లాకు చెందిన కొందరు భక్తులు శ్రీరాముని దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనానంతరం..రెండు శేషవస్త్ర చీరలను కొనుగోలు చేశారు. దుకాణంలో పని చేస్తున్న సిబ్బంది వాటిని రెండు సంచుల్లో పెట్టి భక్తులకు అందజేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉండటం చూసి భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటని షాప్ ఓనర్ను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని భక్తులు తెలిపారు. అయితే కవర్లు లేక ఆ కవర్లో ఇస్తున్నాడేమో అని ప్రశ్నించగా.. అది కూడా కాదని కొత్త కవర్స్ అని సదురు వ్యక్తి పేర్కొన్నట్లు భక్తులు తెలిపారు. దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు.
……………
దీంతో దేవాదాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆలయం దగ్గరకు చేరుకొని సదరు దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించారు. తమ వద్ద ఉన్న అన్ని సంచులపై దేవస్థానం చిత్రాలే ఉంటాయని.. ఆ సంచులు ఏ విధంగా వచ్చాయో తెలుసుకుంటామని చెప్పారు.
………
మొత్తం మీద భద్రాచలం ఆలయంలో అన్యమరబత ప్రచారం జరగడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హిందువుల పుణ్యక్షేత్రాలు టార్గెట్గా పెట్టుకుని క్రైస్తవ మిషనరీలు వంటి సంస్థలు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు.