తెలుగు మాట కొన్ని పట్టణాలు నగరాల్లో బెట్టింగులు బాగా జరుగుతాయి ఈ పందెం రాయులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హాట్ టాపిక్ నిలిచాయి పార్లమెంట్ ఎన్నికలు కలిసి ఉన్నప్పటికీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల మీదనే అందాలు బాగా నడుస్తున్నాయి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల మీద బెట్టింగుకు విపరీతంగా డిమాండ్ నడుస్తోంది.
ఇప్పుడు ఈ బెట్టింగ్ ల కోసం ఇంటర్నెట్ ను వేదికగా వాడుకుంటున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికలుగా బెట్టింగ్ ముఠాలు పెద్ద సంఖ్యలో ఫలితాలపై కోట్ల రూపాయలు బెట్టింగ్ వేస్తున్నాయి. వైయస్ జగన్, లోకేశ్ల మెజార్టీ, గుడివాడ ఎమ్మెల్యే, కడప ఎంపీలపై ఎక్కువగా బెట్టింగ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడటంతో బెట్టింగ్ గ్యాంగ్లు జోరు పెంచాయి. పార్టీలు, నేతలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతుంటే, అదే స్థాయిలో బెట్టింగ్ టీమ్స్ స్పీడ్ పెంచాయి. ఊరించే ఆప్షన్లు బుకీలు పందెం రాయళ్ల ముందు ఉంచుతున్నారు. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేలు ఆధారంగా బెట్టింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కడప, భీమవరం, సిద్ధిపేట, పొద్దటూరులు సత్తామార్కెట్కు ప్రధాన అడ్డాలు. నేషనల్ ఎక్సేంజ్, సెవన్హిల్స్, కవర్స్, పొలిటికల్ బెట్టింగ్. కామ్, బుకీష్.కామ్ వంటి వెబ్సైట్లలో ఫంటర్లు ఆప్షన్లు ఇస్తారు. భీమవరం, కడప బెట్టింగ్ బ్యాచ్లు సొంతంగా సర్వేలు చేసుకుని వాటి ఆధారంగా సత్తా మార్కెట్లో ట్రెండ్స్ నడుపుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆప్షన్లో బెట్టింగ్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా సీట్ల సంఖ్యపైనే బెట్టింగ్ చేస్తున్నారు. YSRCP రాయలసీమలో 30-33మార్క్ చేరుకుంటుందని బెట్టింగ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో YSRCP భారీగా నష్టపోతుందని అక్కడ కేవలం 11 సీట్ల లోపే ఉంటాయన్నది పందెంరాయుళ్ల అంచనా. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు తెలుగుదేశం కూటమికి పట్టం కడతాయని లెక్కిస్తున్నారు. ఉమ్మడి కడప, కర్నూలుజిల్లాలు, అరకు పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్సీపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పందెంరాయుళ్ల లెక్క.
ఇలాంటి విభిన్న అంచనాలతో దాదాపు 1,000 కోట్ల విలువైన బెట్టింగ్ వివిధ యాప్స్లో నిక్షిప్తమైందని బుకీలు చెబుతున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా బెట్టింగ్ చేస్తున్నారు. హాట్ ఫేవరెట్లుగా పవన్ కల్యాణ్, వైఎస్ జగన్, నారా లోకేశ్, బాలకృష్ణ, కొడాలి నాని పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి. పవన్, జగన్, లోకేశ్లపై మెజార్టీలపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతుంటే గుడివాడపై విభిన్నంగా ఉంది. కొడాలి నాని గెలుపు మీద ఎక్కవ మంది బెట్టింగ్ చేస్తున్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థికి రూ.2 వేస్తే, YSRCP అభ్యర్థిపై రూ. 1.5పైసలే వేడయం గమనార్హం. కడప ఎంపీ సీటు ఎవరు గెలుస్తారనే అంశంపైనా ప్రత్యేక పందెం నడుస్తోంది. బెట్టింగ్ సర్క్యూట్లో కడప లోక్సభపై దాదాపు రూ.40 కోట్లు ఉంచినట్లు బెట్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ షర్మిల సాధించే ఓట్లపైనా బెట్టింగ్ చేయడం విశేషం. పైగా పులివెందులలో జగన్ మెజారిటీ గతం కంటే తగ్గుతుందనే అంశంపైనా మరో బెట్టింగ్ సాగుతోంది. తెలుగు దేశం అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం సీటుపై కూడా బెట్టింగ్ నడుస్తోంది.