ఇక్కడ ఉండేకన్నా దేశం విడిచివెళ్లడానికి సిద్ధం…పాకిస్తాన్లోని 37శాతం మంది ప్రజల మనసులోని మాట. చాలామంది బయటపడిపోతున్నారు కూడా. ఇక బలూచిస్తానా ప్రావిన్స్ లో అయితే వీరు 47 శాతంగా ఉంది. ఆ తరువాత ఖైబర్ పఖ్తూన్హ్వా, సింఽధ్ ప్రావిన్స్లున్నాయి. ఇక పాక్ఆక్రమిత కశ్మీర్లోని 44 శాతం ప్రజలు కూడా వీలైతే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్తామనే అంటున్నారు. ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ చేసిన సర్వే రిజల్టే ఇది. 15 ఏళ్లు దాటిన 20వేల 548 మందితో ఆన్లైన్లో ఈ సర్వే నిర్వహించారు. ‘దేశ భక్తి-విధేయత’ అంశాల ఆధారంగా మనోగతం తెలుసుకునేందుకే సర్వే చేసినట్టు సంస్థ తెలిపింది. పాకిస్తాన్ కొన్నేళ్లుగా అన్నివిధాలుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. నిరుద్యోగం పెరిగింది. సంక్షేమం లేదు, అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. అవకాశాలులేక యువత ఆగ్రహంగా ఉన్నారు. మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు.