ముస్లింవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కర్నాటక వక్ఫ్ బోర్డ్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తోంది. డిప్యూటీ సీఎం తోపాటు ముందే అనుకున్నట్టు హోం, రెవెన్యూ, ఆరోగ్య శాఖలూ తమవర్గానికే ఇవ్వాలని కోరుతోంది.
ఈమేరకు ముందే ఒప్పందం జరిగిందని…పార్టీకి మాట ఇచ్చినట్టు ముస్లింలు గంపగుత్తగా హస్తం గుర్తుకే ఓటు వేశారని… వక్ఫ్ బోర్డు చైర్మన్ షఫీ సాదీ తెలిపారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, 30 సీట్లు ఇవ్వాలని ఎన్నికలకు ముందే అడిగానని.. 15 స్థానాల్లో టికెట్ ఇస్తే…9మందిని గెలిపించుకున్నామని. 72 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి ముస్లింలు కారణమని చెబుతున్నారు.ఈ ఎన్నికల్లో మూకుమ్మడిగా కాంగ్రెస్ కు మేలు చేసిన ముస్లింలు ప్రతిఫలం కోరుకుంటారని షఫీ సాదీ అన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుందని..కీలకమైన హోం, రెవెన్యూ, విద్యాశాఖ తమకే ఇవ్వాలని సున్నీ ఉలేమా బోర్డ్ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలోని నిర్ణయించామని ఆయన తెలిపారు.
తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో వారి అనుభవాన్ని బట్టి పదవులు ఇవ్వాలని…హిందూ-ముస్లింల ఐక్యత కోసం అనేకమంది ప్రచారం చేశారని…అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు.
అసలైతే ఎన్నికలకుముందే సున్నీ వక్ఫ్ బోర్డు కాంగ్రెస్ పార్టీ ముందు ఈ డిమాండ్లు పెట్టింది. కర్నాటక రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ముస్లింను ఉపముఖ్యమంత్రిని చేయలేదు. 90 లక్షలమంది ముస్లింలున్నారని..తాము అడిగినట్టు 30 సీట్లు ఇవ్వలేకపోయారని…గెలిచిన వాళ్లల్లో కనీసం ఐదుగురిని మంత్రులుగా తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/amitmalviya/status/1657984785304932352?s=20