దేశ విభజన అప్పుడు కానీ బాంగ్లాదేశ్ విమోచన అప్పుడు కానీ బాగా నష్టపోయింది దళితులు. కొన్ని వేల మంది చంపబడ్డారు. కొన్ని లక్షల మంది ఇళ్లు, భూములు పోగొట్టుకొని పొట్టచేత పట్టుకొని కాందిశీకులుగా భారత్ వచ్చారు. వీరిలో ఎక్కువ మంది బెంగాల్, అస్సాం బీహార్ మొ. రాష్ట్రాలలో సెటిల్ అయ్యారు.
వీరు ఆ దేశాలలో పడ్డ నరకయాతన, క్షోభ గురించి తెలుసుకోవాలి అంటే స్వయంగా దళితుడు మరియు అంబేద్కర్ శిష్యుడు అయిన జోగేంద్ర నాధ్ మండల్ రాసిన ఉత్తరం చదవాలి. అంబేద్కర్ మాట కాదని పాక్ లో అంటే ముస్లిం మెజార్టీ దేశంలో దళితులకు ఎక్కువ గౌరవం, రక్షణ, అభివృద్ధి దొరుకుతుంది అనే గుడ్డి నమ్మకంతో విభజన సమయంలో అంబేద్కర్ భారత్ లో ఉండిపోతే మండల్ గారు పాక్ వెళ్లి అక్కడ ప్రభుత్వం లో మంత్రిగా కూడా చేసారు. కానీ అక్కడకు వెళ్లిన ఆయనకు కొద్ది సం.ల లోనే ఆయనకు జ్ఞానోదయం ఆయింది. దళితులకు ఇక్కడ రక్షణ లభించదు అని మనసు వికలం అయి తిరిగి బెంగాల్ వచ్చి అనామకుడిగా పోయారు. (ఆయన పాక్ ప్రధానికి రాసిన ఉత్తరం సంక్షిప్తంగా ఇక్కడ ఇచ్చాను
1947 లో కానీ 1971 లో కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అలా వలస వచ్చిన దళితుల బాగోగులు గురించి పట్టించుకున్నారా? లేదు. దళితులకు వేరే గత్యంతరం లేదు. ఎవడి కోసం మాకు ఓట్లు వేస్తారు అన్న ధీమాతో… ఓట్ల కక్కుర్తితో అప్పుడు కూడా బెంగాల్, అస్సాం బీహార్ లలో ఒక వర్గం కొమ్మే కాశారు.
బెంగాల్ లో అదే దళిత అంశాన్ని బాగా వాడుకొని సిపిఎం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ 35 సం.ల సిపిఎం పాలనలో కూడా బెంగాల్ లో ఇలా వలస వచ్చిన దళితుల బతుకులు బాగవ్వలేదు. సెక్యూలర్ అని చెప్పుకునే వామపక్ష సిపిఎం కూడా సంతుష్టికరణ రాజకీయాలకే పాలుపడింది.
ఇలా వలస వచ్చిన దళితులు పాక్ లో మరియు బంగ్లాదేశ్ లో వారికి ఎట్లా గొంతు లేకుండా పోయిందో భారత్ లో కూడా ఈ సెక్యూలర్ ప్రభుత్వాల వల్ల అదే అణిచివేత అనే ఇబ్బందికి గురి అయ్యాము అనే భావన ఏర్పడింది. ఇది పోగొట్టడానికి సెక్యూలర్ పార్టీలు ఏ నాడూ ప్రయత్నించలేదు. మమత వచ్చినా వారి పరిస్థితుల్లో మార్పు లేక పోగా మరింత సంతుష్టికరణ విధానం అవలంబించడంతో వారు గట్టిగా పైకి చెప్పుకోలేక మరో గత్యంతరం లేక అలా అణిగి మణిగి వున్నారు.
పశ్చిమ బెంగాల్ లో దళితుల శాతం 27% వరకు ఉంది. ఇప్పుడు ఈ ఓట్ బాంక్ మొత్తం బిజెపి వైపు మళ్లింది. బీజేపీ హిందుత్వ వాదాన్ని గ్రామగ్రామాల్లో వ్యాప్తి చేస్తోంది ఈ దళితులే.
బెంగాల్ నుండి వస్తున్న వార్తలు వింటూ ఉంటే గతంలో ఎప్పడూ కనిపించనంతగా దళితులు ధైర్యంగా తమ హిందూ ఐడెంటిటీ ని బాహాటంగా ప్రదర్శించుకుంటున్నారు.
ప్రముఖ సెఫాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పాటిల్ గారి సర్వే ప్రకారం దళితులలో 84% వరకు బీజేపీ వైపు వెళ్లిపోయారట. మంచి పీక్ టైం లో యూపీలో మాయావతి కి కూడా దళితుల నుండి ఇంత పెద్ద ఎత్తున మద్దత్తు లభించలేదు అని ఆయన చెప్పారు. 2017 యుపి ఎన్నికల ముందు 2016 లో యూపీలో సర్వే నిర్వహించి దళితులు, ఓబీసీ లు బిజెపి వైపు మళ్లడంతో ఇలాగే అంచనా వేసి బీజేపీకి 300 కు పైగా సీట్లు లభిస్తాయని ఈ పాటిల్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్లే యుపి ఎన్నికల్లో బీజేపీకి 300 కి పైగా సీట్లు లభించాయి.
మొన్న అనుకోకుండా లీక్ అయిన క్లబ్ హౌస్ చాట్స్ లో కూడా ప్రశాంత్ కిషోర్ ఇదే విషయమై చెప్పాడు. దళితులు 27% మంది హిందీ మాట్లాడే వారు సుమారు కోటి మంది బీజేపీ వెనుక బలంగా వున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుండి వలసవచ్చిన మతువాస్ అంటే బాగా క్రింది తరగతి దళితులు బిజెపికి 75% వరకు ఓటు వేస్తున్నారు. సెక్యూలర్ పార్టీల విపరీతమైన మైనార్టీ సంతుష్టికరణ వల్ల మిగతా వర్గాలు బెంగాల్ లో సెక్యూలర్ పార్టీస్ నుండి దూరం జరిగాయి. అలాగే దేశంలో మిగతా ప్రాంతాలలో లాగే ఇక్కడా విపరీతమైన మోడీ కల్ట్ ఉంది. ఇక్కడ చాలా మందికి మోడీ దైవంతో సమానం అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
294 మంది సభ్యులు గల బెంగాల్ శాసన సభలో 2016 ఎన్నికల్లో కేవలం 3 సీట్లు సాధించిన బిజెపి ఇంత త్వరగా మమతకు సవాల్ విసర గలదు అని రాజకీయ పరిశీలకులు ఎవరూ ఊహించలేదు.
డాక్టర్ ప్రవీణ్ పాటిల్ గారి ప్రకారం ప్రస్తుతం బెంగాల్ లో బీజేపీ వేవ్ వీస్తోంది. ఇది 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలను గుర్తుకు తెస్తోంది అని చెపుతున్నారు.
వేచి చూద్దాం మే 2వ తేదీ ఫలితాలకు.
చాడా శాస్త్రి….