పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు పీఎం నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు. ఈ భేటీలో తన రాష్ట్రానికి సంబంధించిన MGNREGA, GST బకాయిలతో పాటు పలు అంశాలపై చర్చించారు. నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్నే దేశ రాజధానికి చేరుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. భేటీలో రాష్ట్రానికి బకాయి ఉన్న రూ.1,00,968.44 కోట్ల విలువైన కేంద్ర నిధులను విడుదల చేయాలని కోరారు.
ప్రధానితో భేటీ అనంతరం ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలవనున్నారు. బెంగాల్ లో టీఎంసీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న తరుణంలో మమత పర్యటన చర్చనీయాంశం అయింది.