పాకిస్తాన్లో హిందువులపై హింస ఆగడం లేదు. సింధు ప్రావిన్స్ లోని సింజోరో జిల్లాలో 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. బాధితురాలిని భీల్ కమ్యూనిటీకి చెందిన దియా భీల్ గా గుర్తించారు. అమె తలను తెగనరికి, ఆమె వక్షోజాలు కోసి, ముఖం, ఇతర శరీరభాగాలు వేరుచేసి చర్మం ఒలిచారు. పుర్రె మొత్తం బయటకు వచ్చింది. వక్షోజాల్లోని మాంసాన్ని తీసేయడంతో పక్కటెముకలు కనిపిస్తున్నాయి.తలతీసేసిన మృతదేహాన్ని గోధుమ పొలంలో పడేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు నిందుతులను గుర్తించలేదు. దియాకు ఐదుగురు పిల్లలున్నారు. ఇటీవలే ఆమె భర్త మృతిచెందాడు.
https://twitter.com/KeshooBai/status/1608315618138144769?s=20&t=7zmv2epVU-AleR_vW9q1Sw
పాకిస్తాన్కు చెందిన జర్నలిస్ట్ వీంగాస్ ఈ భయానక సంఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశాడు. మూడు రోజుల క్రితం, సంఘర్ దియాలో, భీల్ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. తలను తెగ్గోశారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. సింధి ప్రభుత్వ కానీ, మానవహక్కుల సంస్థ కానీ దీనిగురించి మాట్లాడలేదు. హిందువులంటే ఇక్కడెవరికీ పట్టింపు లేదని ట్వీట్ చేశారు. అన్నివైపులా కాస్త ఒత్తిడి రావడంతో అఫ్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మరో ట్వీట్లో అప్డేట్ చేశారు వీంగాస్
అటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మొదటి హిందూమహిళా సెనేటర్ కృష్ణకుమారి ఘటనాస్థలాన్ని సందర్శించారు.ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. “40ఏళ్ల వితంతుమహిళ దయా భెల్ ను దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశారు. తలను శరీరంనుంచి వేరు చేశారు. వక్షోజాలు కోసి మాంసాన్ని బయటకు తీశారు’ అని ట్వీట్ చేశారు.
పాకిస్తాన్లో హిందువులపై కిడ్నాపులు, అత్యాచారాలు కొత్తకాదు. బలవంతంగా ముస్లింయువకులకు హిందూ అమ్మాయిలతో వివాహాలు చేస్తూ మతం మారుస్తున్నారు. రెండు నెలల క్రితం రోజువారీ కూలీ అడిగినందుకు పంజాబ్ రాష్ట్రంలో ఓ మహిళను వివస్త్రను చేసి, అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టారు.
https://twitter.com/VeengasJ/status/1608348246468091905?s=20&t=UHqn9Hc3Rm0q-G-1yzXyKg