దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తొలిసారిగా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,41,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా, గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి దాటికి 478 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 1,65,101 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశ వ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7.91 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే అనూహ్యంగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో పలురాష్ట్రాలు మళ్లీ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తుండగా.. కొన్ని చోట్ల హాట్స్పాట్లను గుర్తించి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. పలుచోట్ల ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి.
India reports 1,03,558 new #COVID19 cases, 52,847 discharges, and 478 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,25,89,067
Total recoveries: 1,16,82,136
Active cases: 7,41,830
Death toll: 1,65,101Total vaccination: 7,91,05,163 pic.twitter.com/Kg4rAhfdgE
— ANI (@ANI) April 5, 2021