ఉత్తర్ప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో యోగీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించగా.. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారందరికీ మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. మాస్క్ లేని వారకి వెయ్యి రూపాయల జరిమానా వసూల్ చేయనున్నారు. ఇక రెండోవ సారి పట్టుబడితే వారికి రూ.10/- వేల జరిమానా విధించనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర పరిస్థితులపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఉన్నతాధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.