లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ స్పందించింది. కవిత కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు దర్యాప్తు సంస్థలను కేంద్రంలోనిబీజేపీ ప్రభుత్వం నడిపించడం లేదని అవి స్వతంత్రంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇక కవితపై ఆరోపణలు వచ్చాయని… తనకేం సంబంధం లేదని ఆమె నిరూపించుకోవాల్సి ఉందని పార్టీ సీనియర్లు డీకే అరుణ, ఈటల రాజేందర్ అన్నారు. తప్పుఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని అరుణ అన్నారు.