కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. అనూహ్యంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1.15 లక్షల పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. కరోనా మహమ్మారి బారినపడి 630 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,66,177కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,43,473 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా, కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 8.70 కోట్ల టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది.
https://twitter.com/ANI/status/1379643530461646851