33 ఏళ్లనాటి కశ్మీరీ హిందువుల ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ నాటి వాస్తవపరిస్థితిని కళ్లకుకడుతోంది. సినిమాకు విశేష ఆదరణ వస్తుండడం, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అవడంతో సోకాల్డ్ మేధావులు సహా ఓ వర్గం మీడియా బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వ మీడియాసంస్థ బీబీసీ కూడా అదే పనిలో నిమగ్నమైంది. ఇటీవల జమ్మూలోని జగ్తీ టౌన్ షిప్ లో ఉన్న కశ్మీరీ పండిట్ల అభిప్రాయాన్ని కవర్ చేస్తూ ఓ కథనం ప్రచురించింది. అందులో కాలనీలోని ఇద్దరితో మాట్లాడించింది. కశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపించింది అవాస్తవం అన్నట్టు వారి అభిప్రాయాలు తీసుకుంది. వారి అభిప్రాయాన్నే మొత్తం కశ్మీరీ పండిట్ సమాజం అభిప్రాయంగా బీబీసీ ప్రచారం చేసింది.
https://twitter.com/BBCHindi/status/1504022442527928320?s=20&t=oWYR5LV8sgZk2UNX7tP4og
2014 ఎన్నికలకలకోసం ఇదొక స్టంట్. ఇలాంటి సినిమాలు ప్రజల మధ్య విభజనను, విద్వేషాలను పెంచుతాయి అంటూ ఆ వీడియోను బీబీసీ అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. కశ్మీరీ పండిట్ల నిజమైన గొంతుక ఇది అంటూ సెక్యులరు నాయకులు కొందరు బీబీసీ ట్వీట్ ను పోస్ట్ చేశారు.
ఇక బీబీసీ మాట్లాడించిన సుశీల్ పండిట్ చిత్రం గురించి మాట్లాడుతూ…”ఇలాంటి సినిమాలు కశ్మీర్ లోయలో నివసించే ప్రజల మధ్య శతృత్వాన్ని మరింత పెంచుతాయి. 1990 నుంచీ మా మీద సినిమాలు తీస్తున్నారు తప్ప చెప్పుకోదగిన మార్పు మాత్రం కనిపించలేదు. ఈ సినిమాల వల్ల కశ్మీర్ కో , భారతదేశానికో ఎలాంటి ఉపయోగం లేదు. మమ్మల్నిరాజకీయనాయకులు టిష్యూ పేపర్లుగా వాడుకుంటున్నారు. కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు ప్రజల మధ్య అంతరాలు మరింత పెంచుతాయి” అని అన్నారు.
ఈ మాటలన్న సుశీల్ పండిట్ స్థానిక ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ కార్యకర్త అని ట్విట్టర్లో స్వతంత్రంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే “ది హాక్ ఐ’ వెల్లడించింది. ఇక బీబీసీ ఏకపక్ష కథనం ప్రసారమైన తరువాత అక్కడున్న స్థానికులు సుశీల్ పండిట్ ను నిలదీస్తున్నారు. ఒక్క వ్యక్తి అభిప్రాయాన్ని కశ్మీర్ పండిట్లందరి అభిప్రాయంగా ఎలా ప్రచారం చేస్తారని బీబీసీ మీదా వాళ్లు మండిపడుతున్నారు.
https://twitter.com/thehawkeyex/status/1505571751081967617?s=20&t=hOr2MKdMCSMcH7EGlW1wHA
https://twitter.com/thehawkeyex/status/1505571775849299970?s=20&t=vjl7WisihKQSovkfBTiq9w