తప్పుడు వార్తలు రాసినందుకు క్షమాపణ చెప్పింది బీబీసీ. ప్రిన్స్ చార్లెస్ తో ఎఫైర్ పెట్టుకుందని…ఆయన ద్వారా గర్భం దాల్చి…అబార్షన్ కూడా చేయించుకుందని రాజకుటుంబానికి వ్యక్తిగత సహాయకురాలిగా ఉన్న అలెగ్జాండ్రా టిగ్గీ పెట్టీఫెర్ మీద రాతలు రాసింది బీబీసీ. ఇంతకాలానికి విచారణ సందర్భంగా… క్షమాపణ చెప్పిన బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఆమెకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 1993-99 మధ్య ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కుటుంబానికి వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసింది. ప్రిన్స్ చార్లెస్ 1992లో ప్రిన్సెస్ డయానా నుంచి విడిపోయిన తర్వాత వారి పిల్లలు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ రక్షణ బాధ్యత తనే చూసుకుంది.
ప్రిన్స్ చార్లెస్ కు, అతని వ్యక్తిగత సహాయకురాలి మధ్యవ్యవహారం నడిచిందంటూ 1995లో బీబీసీ ఓకథనం ప్రసారం చేసింది. ఆ సమయంలో బీబీసీ జర్నలిస్ట్ మార్టిన్ బషీర్ డయానాను ఇంటర్వ్యూ చేశారు. అందులో ప్రిన్స్ చార్లెస్ తో వైవాహిక జీవితం విఫలమవడానికి కారణాలనూ వెల్లడించింది. అయితే అత్యుత్సాహం చూపుతూ చార్లెస్ కు , ప్యాలెస్య్ వ్యక్తిగత సహాయకురాలికి సంబంధం ఉందంటూ ప్రసారం చేసింది బీబీసీ. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ యూకే జాతీయ వార్తా సంస్థ అయిన బీబీసీపై పెటిఫెర్ దావా వేశారు.
డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ 1995లో కుట్రపూరితంగా కావాలనే మార్టిన్ బషీర్ తో బీబీసీకి ఇంటర్వ్యూ ఇప్పించినట్టు తెలిసింది. ఆ ఆరోపణలపై పరిశీలించేందుకు బీబీసీ 2021లో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ దీన్ని నిర్థారించింది.
ఈ కేసులో నిన్న లండన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీబీసీ డైరెక్టర్ టిమ్ డేవీ క్షమాపణలు చెప్పాడు. ఆ ఇంటర్వ్యూను బీబీసీ చానెల్లో ఇకపై ప్రసారం చేయబోమని హామీ ఇచ్చారు. పెట్టీఫెర్ కు తగిన పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది బీబీసీ.