
Home News IndiaIndian Mujahideen Terrorist Shahzad Ahmad, Convicted In Batla House Encounter Case, Dies At Delhi AIIMS
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ లో ఇన్స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ, హెడ్ కానిస్టేబుళ్లు బల్వంత్ సింగ్, రాజ్బీర్ సింగ్ను కాల్చి చంపాడు షాజాద్. ఎన్కౌంటర్ తర్వాత తప్పించుకున్న షాజాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించిన ట్రయల్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. పోలీసు అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న కేసులోనూ షాజాద్ దోషిగా తేలాడు.అయితే అనారోగ్యంతో బాధపడుతున్న షాజాద్ను జనవరి 2023లో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ ఘటన అప్పట్లో సంచలనం అయింది. బాట్లాహౌస్ ఎన్కౌంటర్ను బోగస్ ఎన్కౌంటర్గా చిత్రీకరించేందుకు ఒక వర్గం మీడియా, రాజకీయ నాయకులు ప్రచారం చేశారని అప్పటి ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారి కర్నాల్ సింగ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
https://twitter.com/ani_digital/status/1619319798885928960?s=20&t=TxUyeFxV9ghU1GBplEuuUg