కేరళలోని మలప్పురం ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న గుంతలకు అధికారులు మరమ్మత్తులు చేయకపోవడంతో వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే ముందే నీరు నిలిచిన గుంతలో యోగా, స్నానం చేసి అధికారుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వ్యక్తి పేరు హంజా పోరాలి.
https://twitter.com/ANI/status/1557045691452911622?s=20&t=6fa0q1D-gynxWXcTtJg47w
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో వర్షపు నీటితో నిండిన గుంతలో ఆ వ్యక్తి స్నానం చేస్తూ కనిపిస్తాడు. అక్కడే బురద నీటిలో బట్టలు ఉతకడం గమనించవచ్చు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు జరిగాయి. అయితే, నిరసనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఎర్నాకుళం జిల్లా నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా.. రోడ్డుపై కిందపడి ట్రక్కును ఢీకొనడంతో 52 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నిరసనల తర్వాత తమ ఆధీనంలో ఉన్న ప్రతి రోడ్డును సరిచేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు కోరింది.