కరోనాతో భీకర యుద్ధమే చేస్తున్న భారత్ కు బాసటగా ప్రపంచం ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ముందుకొస్తున్నాయి. అమెరికాలోని ప్రముఖ కంపెనీలైన 40 ఓ గ్రూపుగా ఏర్పడి భారత్ కు సహకారం అందించాలని నిర్ణయించాయి. దీన్ని…యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్ షిప్ ఫోరం, బిజినెస్ రౌండ్ టేబుల్ వంటి సంఘాలు స్వయంగా పర్యవేక్షించనున్నాయి. కొన్ని వారాల్లో 20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్ పంపాలని డెలాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ తెలిపారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సహా వైద్యపరికరాలు అందజేయనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.