సరస్వతీదేవిపై నాస్తికసంఘం నాయకుడు రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ బాసర బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులతో పాటు స్థానికులు నిరసనకు దిగారు. రాజేష్ పైన కూడా పీటీ యాక్ట్ పెట్టాలని రాస్తారోకోకు దిగారు. రాజేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటీవల అయ్యప్పస్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న రాజేష్ సరస్వతీ దేవిని హేళన చేస్తూ మాట్లాడారు. ఇక నరేష్ వ్యాఖ్యలపై వివాదం ముదిరిన నేపథ్యంలో బైరి నరేష్ కు సోషల్మీడియాలో మద్దతు తెలుపుతూ మరికొందరు ఆజ్యం పోశారు. ఈ క్రమంలోనే రాజేష్పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు.