బంగ్లాదేశ్ లో ఘోరప్రమాదం జరిగింది. ఓ భారీ నౌకలో అగ్ని ప్రమాదం జరగడంతో 37 మంది మరణించారు. 100 మంది గాయపడ్డారు. ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలో.. ఝలాకటి జిల్లాలోని ఓ నదిలో ఈ ప్రమాదం జరిగింది.
సుమారు వెయ్యి మందితో నౌక ఢాకా నుండి బర్గునా జిల్లాకు వెళుతుండగా అగ్ని ప్రమాదానికి గురైంది.