బంగ్లాదేశ్ లో హైందవ మత గురువు చిన్మయి కృష్ణదాస్ అరెస్టు కలకలం రేపుతోంది. దీనిమీద యావత్ హిందూ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయనతోపాటు 18 మంది మీద దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టారు.
అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయన విడుదల మీద ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. నిజానికి అల్లరి మూకల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్థలు, సాంస్కృతిక నిలయాల మీద ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగుతున్నారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయటం తో పాటు.. ఇస్కాన్ ను నిషేధించడానికి కూడా ప్లాన్ వేస్తోంది. ఈ సమయంలో అక్కడి మత ఛాందసులు హిందూ దేవాలయంపై దాడి చేసి, ధ్వంసం చేశారు. చిట్టగాంగ్ లో వున్న లోకనాథ్ ఆలయంపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ విడుదల చేశారు.
ఈ వీడియో ద్వారా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ వీడియోలో ముస్లింల ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది. ముస్లిం ఛాందసవాదులు కర్రలు, రాడ్లు మరియు కత్తులతో వీధుల్లో బహిరంగంగా అరుస్తూ ఆలయంపై రాళ్లు రువ్వారు. దీనిపై భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా… ఇతర ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.దీనితో పాటు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్, మత ఛాందసవాదులు సాగిస్తున్న హింసను ఆయన విమర్శించారు.
గత నెలలో బంగ్లాదేశ్ లోని ఉత్తర మగురాలోని ప్రసిద్ధ కాళీదేవాలయంపై ఛాందసులు దాడి చేశారు. విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు.అయితే విధ్వంసం చేసిన ఛాందసుడ్ని హిందువులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. అలాగే రాజబరి జిల్లా చమట గ్రామంలో కూడా దేవాలయంపై దాడి జరిగింది.
అక్టోబర్ 10, 2024న సత్ఖిరాలోని శ్యామ్నగర్లో ఉన్న ప్రసిద్ధ కాళీ దేవాలయంలో బంగారు కిరీటం దొంగతనం జరిగింది. విశేషమేమిటంటే, 2021లో ప్రధాని మోదీ ఈ కిరీటాన్ని మా కాళికి అంకితం చేశారు.2024 ఆగస్టు 21న ఇలాంటి మరో ఘటనలో 50 మంది ముస్లిం మత ఛాందసవాదులు బంగ్లాదేశ్లోని ఘాజీపూర్ ఉపజిల్లాలోని కలియాకైర్లో ఉన్న రాధా గోవింద్ లోక్నాథ్ నాట్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
మొత్తం మీద బంగ్లాదేశ్ లోని అనేక చోట్ల బీభత్సం సృష్టిస్తున్నారు. హిందువులలో భయం కలిగించి,, దేశం నుంచి వెళ్ళగొట్టడమే లక్ష్యంగా అల్లరి మూకలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అల్లర్లకు అరాచకాలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మద్దతు ఉండడం దురదృష్టకరం.