స్వయంగా తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా అయింది బంగ్లాదేశ్ పరిస్థితి. స్వార్థం కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల దోసిన అల్లరి మూకలు పండగ చేసుకున్నాయి. దేశమంతా అగ్నిగుండం సృష్టించి విధ్వంసానికి పాల్పడ్డాయి.
ఈ అల్లర్ల ఫలితాన్ని బంగ్లాదేశ్ సమాజం అనుభవిస్తున్నది. అప్పటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి.
జైళ్లను బద్దలుగొట్టడంతో దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పెద్ద ఎత్తున పరారయ్యారు. వీరిలో కొందరిని ఆ తర్వాత పట్టుకోగా, ఇప్పటికీ 700 మంది ఆచూకీ తెలియరాలేదని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు.
ఈ కరెంటు కట్టిన హంతకులు ఉగ్రవాదులు దేశంలో అల్లర్లు కి పాల్పడుతున్నారు. చాలాచోట్ల ప్రతీకార దాడులకు దిగుతున్నారు. దీంతో వీళ్ళని అదుపు చేయలేక పోలీసులు తల పట్టుకుంటున్నారు