బంగ్లాదేశ్ లో నెలకొన్న మహ్మద్ యూనిస్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యలు అవలంబిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత లు పెంచుతోంది. కుంటిసాకులు చెబుతూ, సైన్యాన్ని పెంచుతోంది. భారత సరిహద్దు సమీపంలో టర్కీ తయారీ ‘బైరాక్టర్ టిబి2’ మానవరహిత వైమానిక వాహనాలు (యుఎవిలు) మోహరించినట్లు వచ్చిన నివేదికలను ఆర్మీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. నిఘా కార్యకలాపాల కోసం బంగ్లాదేశ్లోని 67వ ఆర్మీ వాటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం వాటిని మోహరించినప్పటికీ, అధునాతన డ్రోన్లను సున్నిత ప్రాంతాల్లో ఉంచడంతో భారత్ అప్రమత్తం అయింది.
సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి. ఈ ప్రాంతం కూడా చాలా సున్నితమైనదిగా పరిగణించాలి . టర్కియే టిబి-2 డ్రోన్ చాలా శక్తివంతమైనది. ఇది దాడి చేయడమే కాకుండా, గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉగ్రవాద గ్రూపులపై హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆమె భారత్కు వచ్చేశాక త సరిహద్దు సమీప ప్రాంతాల్లోని తీవ్రవాదులు మళ్లీ పుంజుకున్నారు.
బంగ్లాదేశ్ దేశంలోని ప్రస్తుత అస్థిర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్లోకి చొరబడుతున్నట్లు సమాచారం. హసీనా బహిష్కరణ తరువాత సరిహద్దు ప్రాంతంలో భారత వ్యతిరేక అంశాలు పెరిగాయని, ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అధునాతన యుఎవిల మోహరింపుతో నిఘా అవసరమని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.
సరిహద్దుల్లో తాజా డ్రోన్ విస్తరణలను భారత అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాలలో కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలను కూడా తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పరిస్థితిని తెలుసుకునేందుకు భారతదేశం గూఢచార భాగస్వామ్య యంత్రాంగాలను కూడా ఉపయోగిస్తోంది. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలపై తాము అప్రమత్తం అయ్యామని భారత అధికారులు చెబుతున్నారు.
మొత్తం మీద యూనిస్ ప్రభుత్వం.. భారత్ మీద విషం చిమ్ముతున్నదిఇ అని అర్థం అవుతోంది.