బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరుగుతున్న సమావేశాలకు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ చార్జులు హాజరయ్యారు. ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న సంజయ్ ఈ సమావేశాలకు హాజరుకాలేదు. తెలుగురాష్ట్రాల నుంచి డీకేఅరుణ, లక్ష్మణ్, పురంధేశ్వరి, సత్యకుమార్, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సోమువీర్రాజు హాజరయ్యారు.