
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.బషీర్భాగ్ లోని ఈడీ కార్యాలయం ఎదుట కూడా పార్టీ నాయకులు నిరసనకు దిగారు. అటు సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సైతం స్పందించింది. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయ పడింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపింది. అంతేకాదు సంజయ్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది.
వివాదాస్పదం అవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు – మహిళాకమిషన్ నోటీసులు
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.బషీర్భాగ్ లోని ఈడీ కార్యాలయం ఎదుట కూడా పార్టీ నాయకులు నిరసనకు దిగారు. అటు సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సైతం స్పందించింది. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయ పడింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపింది. అంతేకాదు సంజయ్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది.
Share: