తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆలంపూర్ మండలం ఇమ్మాపూర్ నుంచి ప్రారంభమయింది. రెండో రోజు యాత్రలో బండి సంజయ్ తోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు D K అరుణ పాల్గొన్నారు. రెండో రోజు ఉదయం ఇమామ్ పూర్ లో యాత్రను ప్రారంభించి లింగవాయి, భైరాపూర్ మీదుగా ఉండవల్లి చేరుకొని అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. గ్రామాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చేస్తున్న ద్రోహాలను స్థానిక జనాలకు తెలియజేస్తున్నారు. ఉండవల్లి నుంచి ప్రారంభమై చిన్న ఆముదాయాలపాడు, తక్షశిల మీదుగా ప్రగటూర్ చేరుకుంటారు. బండి సంజయ్ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం.