బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు టీఆర్ఎస్ నాయకురాలు కవిత. ఆయన బ్రెయిన్ డామేజ్ అయిందని..అందుకే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని కవిత అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ, నాయకుడు ఎక్కడ పోటీచేయమని ఆదేశిస్తే అక్కడ చేస్తానని అన్నారు. అర్వింద్ మీద పోటీ చేయమంటే చేస్తానని..పోటీ చేయలేకపోయినా…అర్వింద్ ఓటమికోసం ప్రచారం చేస్తానని ఆమె వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రజలను తామెన్నడూ తిట్టలేదని..ఆ ప్రాంతానికి చెందిన నేతల తీరును మాత్రమే విమర్శించామని టీఆర్ఎస్ నేత కవిత అన్నారు.