
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా [PFI] ని అయిదేళ్ళ పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వెతకాల్సి ఉంటుంది.ఆ ప్రశ్నలు ఏమిటో ఒకసారి చూద్దాం !
1. కాంగ్రెస్ ఎందుకు తన ఆఫీస్ ని అంకారా [టర్కీ ] లో తెరిచింది ?
2. కేవలం తన నగ్న శరీరాన్ని రేడియో తో కప్పి తీసిన PK సినిమా హీరో ఎందుకు టర్కీ ప్రధమ మహిళని కలిశాడు ?
3. ఇటీవలే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ [SCO] సమావేశం జరిగిన సమరకండ్ [ఉబ్జెకిస్థాన్ ] లో టర్కీ అధ్యక్షుడు ఏర్డోగాన్ ఎందుకు మాటి మాటికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ తో మాట్లాడడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు ?
4. ఇప్పటికే టర్కీ దేశం FATF విషయం లో గ్రే లిస్ట్ లో ఉంది. తాజాగా భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం టర్కీ నుండి నిధులు భారత్ లోని వివిధ ఉగ్ర గ్రూపులకి చేరాయి అని నిరూపించే ఆధారాలు దొరికినప్పుడు ఆ విషయం బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్,కమ్మీ నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు ?
5. ఈరోజు చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చాడు కానీ ఇన్ని రోజులు జింగ్ పింగ్ ఏమయ్యాడు ? ఎందుకు సమరఖండ్ నుండి ముభావంగా చైనా కి తిరిగి వెళ్ళిపోయాడు ?సీతారామ్ ఏచూరి కానీ ఇతర కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు ? జింగ్పింగ్ గృహ నిర్భందం లో లేడు అని ఎందుకు ఖండించలేక పోయారు ?
6. అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద నిషేధం విధించడం అదీ అయిదేళ్లకే పరిమితం చేయడం మీద సోషల్ మీడియాలో కొన్ని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి కానీ ఎవరూ కూడా పైన ఉదహరించిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఎందుకు లేరు ?

********************************
గత ఆరేళ్లు లేదా ఏడేళ్లుగా ప్రస్తుత హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారి మీద కానీ లేదా జాతీయ భద్రతా అధికారి అయిన శ్రీ అజిత్ ధోవల్ మీద కానీ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన అసంతృప్తి తాలూకు వ్యాఖ్యలకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
***
PFI కి నిధులు గల్ఫ్ దేశాలతో పాటు ప్రధానంగా టర్కీ కి చెందిన గూఢచార సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ [National Intelligence Organization] నుండి పాకిస్థాన్ ISI సహకారంతో భారత్ లోని వివిధ అక్కౌంట్ల లోకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. వీటి మూలాలు కనుక FATF కి ఆధారాలతో సహా ఇస్తే టర్కీ దేశంని FATF బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఇప్పటికే గ్రే లిస్ట్ లో ఉండడం వలన ఇబ్బందులని ఎదుర్కుంటున్న టర్కీ కి బ్లాక్ లిస్ట్ లోకి వెళితే అది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ రాజీనామాకి దారితీస్తుంది లేదా ప్రజలే నిరసన తెలిపి దిగిపొమ్మనవచ్చు. అందుకే ఈ విషయంలో ఎవన్న తనకి కన్సెషన్ దొరుకుతుందో ఏమో అని ఎర్డోగాన్ మోడీజీ తో సంభాషించడానికి ప్రయత్నించినా మోడీజీ ఆ అవకాశం ఇవ్వలేదు.బహుశా కాంగ్రెస్ పార్టీ టర్కీ లోని అంకారా లో తన ఆఫీసుని ఎందుకు పెట్టిందో మీకు అర్ధం అయి ఉండాలి ఈ పాటికి
***********
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కనుక హిట్ అయిఉంటే ఈ పాటికి ఎంతో కొంత మొత్తం పక్కదారి పట్టి ఉండేది. మంచికో చెడుకో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
***************
పాకిస్థాన్ లో ఉగ్ర గ్రూపుల ని అంతర్జాతీయ ఒత్తిడిలకి తలవంచి ప్రభుత్వం నిషేధం విధించినా కొద్ది నెలలు స్తబ్దుగా ఉండి మరో కొత్తపేరుతో కొత్త వాళ్ళతో ఇంకో గ్రూపు ఏర్పాటు చేయడం దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తున్నది. పేరుకే కొత్త వాళ్ళు,కొత్త పేరు ఉంటుంది కానీ వెనక ఉండి నడిపించేది నిషేధానికి గురయిన సంస్థ నాయకులు మాత్రమే. ఎలాగయితే లాలూ ప్రసాద్ యాదవ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీ దేవి చేత పాలన చేయించాడో మనకి తెలిసిందే. UPA చైర్ పర్సన్ పేరుతో మౌన మునిని అడ్డు పెట్టుకొని సోనియా ఎలా అ పాలన సాగించిందో మనకి తెలిసిందే ! PFI అనేది SIMI కి కొత్త పేరు అంతే !
****************
SIMI [Student Islamic Movement of India] వెనక ఉన్న మాస్టర్ మైండ్ అహ్మెదుల్లా సిద్దికీ [Ahamadullah Siddique]. 2001 లో సిమి మీద నిషేధం విధించారు. సిమి కి పాకిస్థాన్ ISI తో నేరుగా సంబంధాలు ఉండేవి. ISI ఏజెంట్ల కి సహకరించేది,ఆశ్రయం ఇచ్చేదీ.
***************
NDF [నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్]ని 1994 లో కేరళ లో స్థాపించారు. చాలా త్వరగానే కేరళలో వేళ్లూనుకుంది NDF. కానీ వివాదాస్పద కార్యకలాపాలకి కూడా కేంద్ర బిందువు అయ్యింది NDF. మరీ ముఖ్యంగా మత ఛాందస సంస్థగా చెడ్డపేరు తెచ్చుకుంది NDF. 2003 లో NDF సభ్యులు మత పరమయిన హింసకి పాల్పడి కేరళలోని ఖోజికోడ్ దగ్గర మారాద్ బీచ్ [Marad Beach in Kerala’s Kozhikode] లో 8 మంది హిందువులని దారుణంగా హత్య చేశారు. దాంతో కేరళ పోలీసులు NDF మీద నిషేధం విధించే అవకాశాలని పరిశీలించడం మొదలుపెట్టడం తో NDF తన రూట్ ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. 2006 లో అంటే 2003 లో 8 మందిని హత్య చేసిన ఘటన జరిగిన తరువాత మూడేళ్లకి ఖోజ్హికోడ్ లో సమావేశం పెట్టి అప్పటికే కేరళ,తమిళనాడు,కర్ణాటక లో పనిచేస్తున్న వివిధ సంస్థలని ఒకటిగా చేయాలని నిర్ణయించింది NDF. 1. కేరళలో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ 2. కర్ణాటకలో – కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నీటి [Karnataka Forum for Dignity]. 3. తమిళనాడు లో మనిత నీతి పసరై [Manitha Neethi Pasarai]. ఈ మూడు సంస్థలు కూడా వేరే వేరే పేర్లతో ఉన్నాయి కానీ మూడు కూడా NDF ఛత్రం కింద పనిచేసేవి. ఈ మూడు సంస్థలు కలిసి ఒకే సంస్థగా ఏర్పడి దానికీ PFI [పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ] పేరు పెట్టుకొని మనుగడలోకి వచ్చింది
******************
2006 లో ఢిల్లీ లోని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్ XXI 1860 [Societies Registration Act XXI of 1860] కింద PFI ని రిజిస్టర్ చేశారు. కుల,మత విచక్షణ లేకుండా అందరికీ సామాజిక,న్యాయపరమయిన స్వేచ్చని కల్పించాలి అనే లక్ష్యం తో ఈ సంస్థని ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కి ఇచ్చిన ఆఫడవిట్ లో పేర్కొన్నారు. చూడడానికి,వినడానికి చాలా బాగుంది కదా ? వీళ్ళ లక్ష్యం ఏమిటో ? కేరళలోని ఒక పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ P. కోయ [P. Koya] దీనికి ఆద్యుడు.
********************
PFI ముసుగు !
మరీ బహిరంగంగా తీవ్ర వాద కార్యకలాపాలు చేస్తే వెంటనే నిషేధం విధిస్తారు కాబట్టి ఒక ముసుగు [Mask] కావాలి కదా ? ఇదిగో ఆ ముసుగు: బయటి ప్రపంచానికి తాము సేవ చేస్తున్నట్లు తెలియాలి అలాగే దేశ,విదేశాల నుండి విరాళాలు రావాలి అంటే కొన్ని సంక్షేమ ప్రాజెక్ట్ లని బహిరంగంగా పనిచేస్తున్నట్లుగా చూపించాల్సి ఉంటుంది. అవి ‘స్కూల్ ఛలో ‘ అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించింది PFI. సెకండరీ స్కూల్ కి విద్యార్ధులని వెళ్ళడానికి ప్రోత్సాహిస్తున్నాము అంటూ ప్రచారం మొదలుపెట్టింది PFI. డానికి ఇంకో పేరు కూడా పెట్టింది అది సర్వ శిక్ష గ్రామ్ మరియు ఒక విద్యార్ధిని దత్తత తీసుకోండి ‘ అంటూ [‘Sarva Shiksha Gram’ & ‘Adopt a student’]. ఏదో సేవ చేస్తున్నాము అని అనిపించుకోవడానికే ఇదంతా ! కానీ అంతర్గతంగా తీవ్ర వాద కార్యకలాపాలకి సహకరిస్తూ వాళ్ళకి నిధులని అందచేస్తూ దేశంలో అశాంతిని కలుగచేయడమే అసలు లక్ష్యం PFI ది. మొత్తం ప్లాన్ అంతా పాకిస్థాన్ ISI ది. అమలు చేయడానికి ఒక చట్ట బద్ధమయిన రిజిస్టర్ కాబడ్డ సేవా సంస్థ కావాలి, అది PFI అన్నమాట. ఇక నిధులు నేరుగా కాకుండా టర్కీ ఇంటెలిజెన్స్ సంస్థ ద్వారా వివిధ దేశాలకి నిధులు వెళ్ళి అక్కడ నుండి PFI అనబడే సేవా సంస్థకి విరాళాల రూపంలో చిన్న చిన్న మొత్తాలలో వివిధ అక్కౌంట్ల లోకి చేరతాయి. కాబట్టి నిఘా సంస్థలకి అంత సులువుగా అనుమానం రాదు. ఇదంతా ఒక సాలె గూడు లాంటిది. ఎంతో ఓపికగా వేతకాల్సి ఉంటుంది. అందుకే ఇంత సమయం తీసుకుంది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ.
నిషేదం తరువాత అసలు కధ ఇంకా మిగిలే ఉంది. PFI తరుపున సుప్రీం కోర్టులో హిజాబ్ కేసులో వాదించడానికి ఏకంగా 12 మంది అడ్వకేట్లు పనిచేస్తున్నారు అంటే డబ్బు ఏ విధంగా వరదలై పారుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం తరుపున కేవలం ముగ్గురు అడ్వకేట్లు వాదిస్తున్నారు. ఇక PFI నిషేధం మీద ఎన్ని రోజులు ఎంత మంది అడ్వకేట్లు అంటే కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగుతారో రేపో మాపో తెలిసిపోతుంది. ఇంకా ఉంది …. – పార్ధసారధి పోట్లూరి