మరికొన్ని యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దేశసమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ఇప్పటికే 320 యాప్స్ ను నిషేధించిన కేంద్రం…తాజా 2021 ఐటీ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయన్న కారణంగా 22 యూట్యూబ్ చానల్స్, 1 న్యూస్ వెబ్ సైట్ పై నిషేధం విధించింది. మరో 3 ట్విట్టర్ అకౌంట్లు, ఒక ఫేస్ బుక్ ఖాతానూ నిషేధించింది. బ్యాన్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లు, ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్, న్యూస్ వెబ్సైట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. ఈ చానల్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని తెలిపింది. నిషేధిత యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లలో 18 భారతదేశానికి చెందినవి కాగా, 4 పాకిస్తాన్కు చెందినవి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)