పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్నిఆదేశించింది సుప్రీంకోర్టు. బల్వంత్ సింగ్ 26 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్ వేశాడు రాజోనా.
సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 1995 ఆగస్టు 31న చండీగఢ్ సచివాలయం ముందు జరిగిన పేలుడులో బియాంత్ సింగ్తో పాటు మరో 16 మంది మరణించాడు. ఈ పేలుడులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ రాజోనాను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. 26 ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నాడు. 2012 నుంచి ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉంది.