నేరడిగొండ మండలం కుంటాల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విషజ్వరాలు సోకి దాదాపు 21 మంది విద్యార్థుల ఆరోగ్యం క్షీణించి అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. మన జిల్లాలో చాలా మంది విషజ్వరాల బారిన పడ్డారని వ్యాదులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రిమ్స్ దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్డుల ఆరోగ్య పరిస్థితులపై ఆరాతీసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని అన్నారు. డాక్టర్స్ తో మాట్లాడి పిల్లలు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.