జీహెచ్ఎంసీ ఎన్నిక నగారా మోగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీపావళి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవైపు అధికారులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లపై నిమగ్నంకాగా, కొన్ని పార్టీలు ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి కసరత్తు చేస్తున్నాయి. విజయం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడమే ఇందుకు కారణం. అందువల్ల గ్రేటర్ ఎన్నికలు ముందుగా నిర్వహించాలని టీఆర్ఎస్ అనుకుంటోంది.
పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఈసీ పరిశీలించిన విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. కరోనా నిబంధనలుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. బల్దియాలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నాయి. ఈ సారి బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడానికి రగం సిద్ధం చేసింది. దుబ్బాకలో మాదిరిగా గ్రేటర్ ఎన్నికల్లో తమ పరువు పోగొట్టుకోకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే అధికార పార్టీ ముందు ప్రస్తుతం చాలా సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ బీజేపీ ఉపయోగించుకుని లాభం పొందే అవకాశం ఉంది.