లాక్ డౌన్ ప్రభావం మనుషులకే కాదు నోరులేని జీవులపైనా పడింది. కీసరగుట్ట ప్రాంతంలో ఆహారం లేక వానరాలు అల్లాడుతున్నాయి..విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు రోజూ వాటికి ఆహారం పెడుతున్నారు. 14 రోజుల నుంచీ రోజూ పండ్లు,ఇతర ఆహారాన్ని తీస్కెళ్తున్నారు..ఇవాళ కూడా తెలంగాణ కన్వీనర్ సుభాష్ చందర్ సహా పలువురు కోతులకు ఆహారం అందించారు