ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ పై దాఖలైన మొత్తం ఆరు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వదలకుండా నిర్బంధంలో ఉంచడానికి సరైన కారణాలు కనిపించడం లేదని..అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామని జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. యూపీలో తనపై దాఖలైన ఆరు ఎఫ్ఐఆర్ లు కొట్టివేయాలంటూ గతవారం సుప్రీం పిటిషన్ దాఖలు చేశారు.
లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, ముజఫర్నగర్, ఘజియాబాద్, హత్రాస్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు సిట్ను ఏర్పాటు చేయడాన్ని కూడా పిటిషన్లో సవాలు చేశారు.
హిందూ దేవీదేవుళ్లను కించపరిచేలా ట్వీట్లు చేశారంటూ… ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు జుబైర్ ను అరెస్ట్ చేశారు. ఓ మతవిశ్వాసాలను అవమానించేలా ఉద్దేశపూర్వకంగానే…ఆయన ట్వీట్లు చేశారని ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.